ఒక గ్రంథమును పరభాషీయులు సైతము చదవవలెయునంటే కచ్చితముగా ఆ గ్రంథమును సంబంధిత భాషలో అనువాదము చేయవలెను. పాత నిబంధన లేఖనముల విషయములోను జరిగినది.
హెబ్రీ భాష
అబ్రాహాము కనాను చేరుటకు మునుపు వరకు అరాము భాషను మాట్లాడువాడు. కనాను చేరిన పిమ్మట ఆయన హెబ్రీ భాషను అలవరచుకున్నాడు. అబ్రాము తరువాతి సంతతి సైతము హెబ్రీ భాషను తమ స్వంత భాషగా చేసుకున్నారు. అందువలనే యూదుల పవిత్ర లేఖనములైన పాత నిబంధన లేఖనములన్నీ ఆదిమ హెబ్రీ భాషలోనే వ్రాయబడినవి. క్రీస్తు పూర్వము 1450వ సంవత్సరము వ్రాయబడిన పంచకాండములు మొదలుకొని క్రీస్తు పూర్వము 400వ సంవత్సరములో వ్రాయబడిన మలాకీ గ్రంథము వరకు పాత నిబంధన లేఖనములన్నీఆదిమ హెబ్రీ భాషలోనే వ్రాయబడినవి.
కాలక్రమములో యూదులు మాత్రము తమ స్వంత భాషకు దూరమైయ్యారు. యెరూషలేము నాశనమై యూదులు చెఱ నిమిత్తము బబులోనుకు కొనిపోబడిన కాలములో హెబ్రీ భాషకు భాషకు యూదులు దూరమైయ్యారు. బబులోనులో స్థానిక భాష అరాముగా ఉండటంతో పాటు అది హెబ్రీ భాషకు చాలా దగ్గర పోలికలు కలిగియుండటంతో యూదులు శీఘ్రముగా అరాముకు అలవాటుపడిపోయారు. ఆ కాలములోనే అరాము భాషను తమ స్వంత భాషగా చేసికొనియున్నారు. ఇలా పలు సంఘటనల కారణముగా కూడ యూదులు చెదరగొట్టబడి హెబ్రీ భాషకు దూరమైయ్యారు.
యూదుల కొరకే తర్జుమా
పాత నిబంధన లేఖనముల కాలము సంపూర్తియైన క్రీస్తు పూర్వము 400 సంవత్సరముల నాటికి పలువురు యూదులు అప్పటి సామాన్య వాడుక భాషలో ఒకటిగా ఉన్న గ్రీకును తమ స్వంత భాషగా చేసికొనిరి. దీంతో తమ స్వంత దేవుని గురించి పవిత్ర లేఖనముల్లో చెప్పబడిన విషయములను గ్రహించలేని పరిస్థితి యూదులకు ఏర్పడినది. అందువలన గ్రీకు భాషను వాడుక భాషగా చేసుకున్న యూదులకు ఆ భాషలోనే తమ పవిత్ర లేఖనములను మరియు తమ నిజ దేవుని (యెహోవా) గురించి బోధింపవలెననే ఉద్దేశ్యముతో పాత నిబంధన లేఖనములను భాషలోనికి అనువదించడానికి అంకురార్పణ జరిగినది. క్రీస్తు పూర్వము 3వ శతాబ్దములో యూదు పండితులు (రబ్బీయులు) ఈ పనులను చేపట్టియున్నారు. ప్రప్రథమముగా గ్రీకు భాషలో నాంది పలికిన పాత నిబంధన లేఖనముల తర్జుమా తర్వాతి కాలములో ప్రపంచములోని వివిధ భాషల్లోకి అనువదింపబడెను.
No comments:
Post a Comment