క్రీస్తు పూర్వము 3వ శతాబ్ధములో గ్రీకు భాష మాట్లాడే ప్రాంతాల్లో నివసించే యూదుల సౌలభ్యము కొరకు పాత నిబంధన లేఖనములను హెబ్రీ భాష నుంచి గ్రీకు భాషలోనికి తర్జుమా చేయడంతో అనువాదమునకు నాందిపడినట్లయినది. ఈ అనువాదము జరిగిన విధానమును క్రీస్తు పూర్వము 2వ శతాబ్దమునకు చెందిన అరిస్టియస్ అనే వ్యక్తి తన సోదరుడైన ఫిలోక్రేట్స్ కు రాసిన ఓ లేఖ తెలియజేస్తుంది. అరిస్టియస్ చేత రాయబడిన లేఖ కావడంతో దానిని అరిస్టియస్ లేఖగా పేర్కొంటున్నారు.
అరిస్టియస్ లేఖ ప్రకారము:
అరిస్టియస్ లేఖలోని గాథ కల్పన మాత్రమే అనే విమర్శలు ఉన్నాయి. చారిత్రక అధ్యాయనము ద్వారా పాత నిబంధన లేఖనములను క్రీస్తు పూర్వము 3వ శతాబ్దము నుంచి క్రీస్తుపూర్వము 1వ శతాబ్దము మధ్యకాలముల్లో గ్రీకు భాషలోకి అనువదించినట్లు చారిత్రకారులు విశ్వసిస్తున్నారు. క్రీస్తు పూర్వము 3వ శతాబ్దములో తోరా (పంచకాండములు), క్రీస్తు పూర్వము 185వ సంవత్సర కాలములో కీర్తనల గ్రంథము, ఆ తరువాత యెహెజ్కేలు మరియు 12
మంది చిన్న ప్రవక్తలుగా పిలువబడిన హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహుము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ గ్రంథములను, ఆ తరువాత చారిత్రక గ్రంథములైన యెహోషువ, న్యాయాధిపతులు, 1,2 సమూయేలు,
1,2 రాజులు, 1,2 దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, గ్రంథములను, చివరగా యెషయా గ్రంథమును, క్రీస్తు పూర్వము 150వ సంవత్సరములో దానియేలు, యోబు, క్రీస్తు పూర్వము 1వ శతాబ్ధములో పరమగీతము, విలాపవాక్యములు, రూతు, ఎస్తేరు తదితర గ్రంథములను అనువదించియుండవచ్చని భావిస్తున్నారు.
సెప్టువజింటు
పాత నిబంధన లేఖనములను హెబ్రీ భాష నుంచి గ్రీకు భాషలోనికి అనువదించిన యూదు పండితులను 'సెప్టువజింటు' అను పేరుతో వ్యవహరిస్తున్నారు. లాటిన్ భాషా యందు
"సెప్టువజింట' అనగా 70
అని అర్థము. పాత నిబంధన లేఖనములను గ్రీకు భాషలోకి అనువదించిన యూదు పండితుల సంఖ్య 70గా విశ్వసించడంతో ఆ అనువాదకర్తలను 'సెప్టువజింటు' గా వ్యవహరిస్తున్నారు. సెప్టువజింట అనే లాటిన్ పదమును సంఖ్యారూపములో రోమన్ అంకెలను ఉపయోగించి LXX తో సూచిస్తారు.