Tuesday, January 7, 2014

దేవుని సృష్టి ఆరు రోజుల్లోనే పూర్తి కాలేదు!


''ఆకాశమును, భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తానూ చేసిన తన పని యేడవదినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన పనియంతటి నుండి యేడవ దినమున విశ్రమించెను''. ఆది 2: 2-3

పై వాక్యాన్ని చదివిన పలువురు క్రైస్తవులు సృష్టి అంతా ఆరు రోజుల్లోనే పూర్తి అయ్యిందని భావిస్తున్నారు. బైబిలు చరిత్ర ప్రకారము ఆది పురుషుడైన ఆదాము నుంచి ఇప్పటి వరకు సుమారు 7,000 సంవత్సరాలు మాత్రమే. బైబిలు లేఖనాల ప్రకారము భూమిని, మనిషిని ఆరు రోజుల సృష్టి క్రమంలోనే దేవుడు సృష్టించెను కాబట్టి భూమి వయస్సు కూడా సుమారు 7,000 సంవత్సరములు మాత్రమే.
అయితే శాస్త్రవేత్తలు మాత్రం భూమి పుట్టి ఇప్పటికి సుమారు 450 కోట్ల సంవత్సరాలు అని, మానవ జాతి పుట్టి సుమారు లక్ష సంవత్సరాలని చెబుతున్నారు. కార్బన్ డేటింగ్ మొదలైన పలు విధాలైన శాస్త్రీయ పరిశోధనల అనంతరం విషయాన్ని వెల్లడించారు. వాస్తవానికి సృష్టిని ఆరు రోజుల్లోనే దేవుడు పూర్తి చేయలేదు. బైబిలు లేఖనాల్లో దాగున్న నిగూఢతను గ్రహించగలిగితే సత్యం బోధపడుతుంది.

ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను! ఆది 1: 1

'ఆది' అనే ఒక్క పదముతోనే సృష్టి చాలా పురాతనమైనదని చెప్పబడినది. 'ఆది' అనేది ఎప్పుడని కచ్చితముగా చెప్పటానికి నరుడికి జ్ఞానము చాలనప్పటికీ అది శాస్త్రవేత్తల పరిశోధనలకు అనువుగానే ఉందని బైబిలు లేఖనాలు ద్వారానే నిరూపించవచ్చును.

అది ఎలాగో చూద్దాం!

భూమి తన చుట్టు తాను ఒకసారి పూర్తిగా తిరిగితే ఒక రోజు, భూమి చుట్టూ చంద్రుడు ఒక్కసారి పూర్తిగా తిరిగితే నెల రోజులు, సూర్యుని చుట్టు భూమి ఒక్కసారి పూర్తిగా తిరిగితే ఒక సంవత్సర కాల ప్రమాణముగా భావిస్తున్నాము. ఇదే విషయాన్ని లేఖనము కూడా చెబుతుంది చూడండి...

"దేవుడు- పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను. ప్రకారమాయెను. దేవుడు రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును, పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను." ఆది 1: 14-16

పై వాక్యమును బట్టి సృష్టి కల్పనలో నాలుగవ దినము వరకు సూర్య చంద్రులు సృజింపబడలేదని తెలుస్తుంది. అయితే మొదటి రోజే వెలుగు, చీకటి ఉన్నాయని, అస్తమయము, చీకటి కలిగిందని, దాని ఆధారంగానే ఒక దినము అయ్యిందని లేఖనాలు సూచిస్తున్నాయి. అందుకు కింది లేఖనాలను పరిశీలించండి...

"దేవుడు - వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడుకు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును, ఉదయమును కలుగగా ఒక దినమాయెను" ఆది 1: 3-5

పై వాక్యములో పేర్కొన్న దిన ప్రమాణము కచ్చితముగా 24 గంటలు ఉండే మానవ ప్రమాణము కాదనే విషయం స్పష్టమవుతుంది. మరి ప్రమాణం ఎవరిదంటే కచ్చితముగా అది దేవునికి సంబందించినదే.

దేవునికి ఒక దిన కాల ప్రమాణము ఎంత?

దేవుడు సృజించిన విశ్వములో జీవి ఉనికి ఉన్న సౌర కుటుంబములో భూమిపైన ఒక దిన ప్రమాణము 24 గంటలుగా ఉండగా ఇదే బుధ గ్రహముపైన 59 రోజులు, శుక్ర గ్రహముపైన 243 రోజులుగా ఉంది. అంటే, మనకు 59 రోజులు అయితే బుధగ్రహంపైన ఒక రోజుతో సమానము. అలాగే మనకు 243 రోజులైతే శుక్ర గ్రహంపైన ఒక రోజుతో సమానము. మరి విశ్వాన్ని సృజించిన దేవుని కాల ప్రమాణము కచ్చితంగా మానవుని దిన ప్రమాణము కన్నా ఎంతో శ్రేష్ఠమైనదిగా ఉండాలి. ఇదే విషయాన్ని లేఖనాలు వెల్లడిస్తున్నాయి.

"నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి. రాత్రి యందలి యొక జాము వలె నున్నవి." కీర్తనలు 90: 4

దేవుని దృష్టికి వేయి సంవత్సరములు ఒక రోజుగా మరియు ఒక జాము ( గంటలు) వలె ఉన్నాయని చెప్పటం ద్వారానే మానవుడి వేలాది సంవత్సరాలు దేవుడికి ఒక్క రోజుతో సమానమని అర్థమవుతుంది. అంటే, సృష్టి జరిగిన ఒక రోజు ప్రమాణము మానవుడికి వేలాది సంవత్సరాలతో సమానమని గ్రహించవచ్చు.

బైబిలు గొప్పదనం


అక్షర జ్ఞానం లేని పామరుడైనా సరే బైబిలులోని సారాంశం తెలిస్తే చాలు, నేటి విద్యావంతులకు ధీటుగా విషయ పరిజ్ఞానం పొందినట్టే. శాస్త్ర సాంకేతిక రంగం, ఖగోళం, అంతరిక్షం, వైద్యం, భూగర్భం, విమాన శాస్త్రం ఇలా ఎన్నో రంగాల గురించి కొద్దో, గొప్పో విషయాలు గ్రహించినట్లే. నేటి సామాజిక పరిస్థితులకు తగిన చట్టాలు, లోకొక్తులు, సూక్తులు, జనరల్ నాలెడ్జ్ వంటి విభిన్న అంశాలపైన తిరుగులేని పట్టు సాధించినట్లే. అంతగా అనంత విషయాలను అక్షర రూపంలో బైబిలు తనలో నిక్షిప్తం చేసుకుంది. నేడు శాస్త్రవేత్తలు కనిపెట్టె పలు విషయాలు ఇప్పటికే బైబిలులో శాస్తీయంగానే ఉన్నాయి. అద్భుత విషయాల సంక్షిప్త సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం!...

  • అనంత విశ్వం పుట్టుక గురించి తెలుసుకోవటానికి నేటికీ శాస్త్రవేత్తలు కృషి చేస్తూనే ఉన్నారు. అయితే విశ్వం పుట్టుక గురించిన ప్రాథమిక సమాచారాన్ని బైబిలు అందిస్తుంది.
  • మన సూర్య కుటుంబం ఏర్పడి సుమారు 500 కోట్ల సంవత్సరాలు అయ్యిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అయితే సూర్య కుటుంబం ఏర్పడి అన్నే సంవత్సరాలు అయ్యిందని బైబిలు కూడా చెబుతుంది.
  • భూమి మీద జీవం పుట్టుక మొదలుకొని మానవ జాతి ఆవిర్భావ క్రమం వరకు శాస్త్రవేత్తలు వివరించిన విషయాలనే బైబిలు కూడా విశదీకరిస్తున్నది.
  • శాస్త్రవేత్తలు పేర్కొంటున్న మానవ నాగరికత పరిణామ క్రమము వివరణనే బైబిలులో కూడా చూడొచ్చు.
  • కాల గర్భంలో కలిసిపోయి నేడు వెలుగు చూస్తున్న అతి ప్రాచీన చరిత్రకు సంబంధించిన పలు విషయాలు బైబిలులోఅక్షర సత్యాలుగా ఉన్నాయి.
  • సైన్స్ విద్యార్థులు చదువుకునే డీఎన్ఏ, జన్యువులకు సంబందించిన ప్రస్తావన బైబిలులో అంతర్లీనంగా కనిపిస్తుంది.
  • నేటి న్యాయశాస్త్రానికి ధీటైన చట్టాలను, శిక్షలను గురించి బైబిలు విపులీకరిస్తుంది.
  • భారత దేశంతో బైబిలులోని చారిత్రక ఘటనలకు ఉన్న రాజకీయ, పరిపాలన సంబందాలను గురించి చెబుతుంది.
  • ప్రస్తుతం హిందువులు ఆచరిస్తున్న పూజలు, జంతు బలులు, మొక్కుబడులు యూదులు సైతం ఆచరించిన వాస్తవం బైబిలులో చూడొచ్చు.
  • ప్రస్తుతం కనుమరుగైన అరుదైన జీవజాతులు, వాటి భౌతిక నిర్మాణ తీరును బైబిలు వివరిస్తుంది.
  • మానవాతీతులతో మానవులకు ఉన్న అవినావభావ సంబందాలను స్పష్టం చేస్తుంది.
  • ఇలాంటి మరెన్నో విషయాలను ఇముడ్చుకున్న అద్భుత గ్రంథమే బైబిలు.

Monday, January 6, 2014

తొలి నాళ్లలో పాత నిబంధన గ్రంథములోని పుస్తకముల సంఖ్య ఎన్ని?

పాత నిబంధన గ్రంథములోని పుస్తకముల సంఖ్యను నిర్ణయించే విషయమై క్రీస్తు శకము 1 శతాబ్ధము నుంచే యూదు పండితుల మధ్య విభిన్న అభిప్రాయములు నెలకొన్నవి. ప్రస్తుతము పాత నిబంధన గ్రంథములోని పుస్తకములన్నీ తొలి నాళ్లలోనే ఉన్నవి. అయితే వాటిలో కొన్ని పుస్తకములను ఒకే గ్రంథముగా చేయుట వలన ఇప్పటికన్నాఅప్పట్లో పాత నిబంధన గ్రంథములోని పుస్తకముల సంఖ్య తక్కువగా ఉండేది.

22 పుస్తకముల కోసము ప్రయత్నము

పాత నిబంధన గ్రంథముగా నేడు వ్యవహరిస్తున్న యూదు పవిత్ర లేఖనముల్లో మొత్తము ఎన్ని పుస్తకములు ఉండాలనే విషయమై క్రీస్తు పూర్వము నుంచే కసరత్తులు జరిగాయి. క్రీస్తు శకము 100 సంవత్సరములో యెరూషలేముకు పడమరనున్న జామ్నియాలోని యూదు అధ్యయన కేంద్రములో యూదు పండితులు మధ్య విషయమై తర్జన భర్జనలు జరిగేవి. పాత నిబంధల లేఖనములు వ్రాయబడిన హెబ్రీ భాష అక్షరమాలలో 22 అక్షరములు ఉండటంతో యూదు లేఖనముల్లో కూడ 22 గ్రంథములే ఉండాలని పలువురు వాదించి యున్నారు. యోసీఫస్ (క్రీస్తు శకము 37-100) అను యూదు చారిత్రకారుడు సైతము యూదు లేఖనముల్లో 22 గ్రంథములే ఉండాలని కొందరు యూదు పండితుల సహకారముతో ప్రయత్నించి యున్నాడు. అయితే 24 గ్రంథములు ఉండలన్ని యూదు పండితుల్లో వేరొక వర్గము వాదించినది. ప్రకారము 24 గ్రంథములు ఉండే విధముగా మొదట మూడు భాగములుగా పాత నిబంధన లేఖనములను విభజించిరి.


అది ఎలాగో చూద్దాము.
1. తోరా = 5 గ్రంథములు
మొదటి భాగమునకు 'తోరా' అని పేరు. హెబ్రీ భాషయందు పదమునకు 'బోధించు' అని అర్థము. ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రమును మోషే బోధించుట వలన ఆయన వ్రాసినట్లు భావిస్తున్న పంచకాండములకు తోరా అనే పేరును పెట్టియున్నారు. ఆదికాండము, నిర్గమ కాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము అనునవి పంచకాండములు.


2. ప్రవక్తల గ్రంథములు = 8 గ్రంథములు
రెండవ భాగమునకు నెబియీమ్ అని పేరు పెట్టియున్నారు. పదమునకు హెబ్రీ భాష యందు ప్రవక్తలు అని అర్థము. ఇందులో పూర్వపు ప్రవక్తలు మరియు తరువాతి ప్రవక్తలు అని రెండు విభాగములు ఏర్పరచియున్నారు.
a. పూర్వపు ప్రవక్తలు: 4 గ్రంథములు
యెహోషువ, న్యాయాధిపతులు, 1, 2 సమూయేలు (ఒకే గ్రంథము), 1, 2 రాజులు


(ఒకే గ్రంథము)
b. తరువాతి ప్రవక్తలు: 4 గ్రంథములు
యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, 12 మంది చిన్న ప్రవక్తలు రాసిన గ్రంథముల

(హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీఖా, నహూము, హబక్కూకు
జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ) సముదాయము.


3. పరిశుద్ధ వ్రాతలు: 11 గ్రంథములు
మూడవ భాగమును కెతిబియీమ్ గా పిలుచుచున్నారు. పదమునకు హెబ్రీ భాష యందు 'వ్రాతలు' అని అర్థము. దానినే తెలుగులో 'పరిశుద్ధ వ్రాతలు'గా వ్యవహరిస్తున్నారు.
a. యోబు, కీర్తనలు, సామితెలు = 3
b. దానియేలు, 1, 2 దినవృత్తాంతములు (ఒకే గ్రంథము), ఎజ్రా, నెహెమ్యా (ఒకే  గ్రంథము) = 3


c. అయిదు చుట్టలు:
ప్రవక్తలు (కెతిబియీమ్) లో ఒక భాగమే అయిదు చుట్టలు. దీనిని హెబ్రీ భాషలో 

మెగిలోత్ అందురు. పదమునకు హెబ్రీ భాషయందు చుట్టలు (Scrolls) అని

అర్థము. పరమగీతము, రూతు, ప్రసంగి, ఎస్తేరు, విలాపవాక్యములు అనే అయిదు
గ్రంథముల సముదాయమునే అయిదు చుట్టలు అని అందురు.